జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ప‌ర్సెంటేజీల‌తో స‌హా ఫ‌లితాలు ముందే చెప్పిన ‘గేమ్‌ఛేంజ‌ర్’ స‌ర్వే



హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించాడు. 24 వేల ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేసిన ఈ ఫలితం, పార్టీలో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఈ సందర్భంగా, ‘గేమ్ ఛేంజర్ – మీడియబాస్’ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 100 శాతం సత్యస్థితి బయటపడ్డాయి.

పోలింగ్ డే సాయంత్రం విడుదల చేసిన తమ అంచనాల్లో, ఈ సంస్థ కాంగ్రెస్‌కు 47 శాతం, BRS‌కు 39 శాతం, BJP‌కు 9 శాతం ఓట్లు పడతాయని ప్రకటించింది. తాజా ఎన్నికల ఫలితాల్లో ఈ పర్సెంటేజీలు అతి సమీపంగా రావడంతో, ‘గేమ్ ఛేంజర్’ నిర్వాహకులు భారీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. “మా అంచనాలు మళ్లీ ఒక్కసారి ఖచ్చితంగా నిజమయ్యాయి. ఇది మా బృందం కృషి ఫలితం” అని వారు పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో కూడా ఈ సంస్థ పర్సెంటేజీలతో సహా 100 శాతం ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేసి, తమ విశ్వసనీయతను నిరూపించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *