కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేధింపులకు విద్యార్థి బలి అయిన దారణమిది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ చైతన్య శారదా భవన్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య కారణమైన 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్స్టేషన్లో గన్నవరం డిఎస్పి చలసాని శ్రీనివాసరావు, పెనమలూరు సిఐ జె వెంకట రమణ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టకు చెందిన మొల్లి పవన్ కుమార్ […]
